స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదరికంలో దిగువన ఉన్నటువంటి 20% కుటుంబాలను వెతికి వారి యొక్క స్థితిగతులు, ఆర్థిక ప్రమాణాలు పెంచేందుకుగాను వారిని ఎంచుకునేందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా AP P4 Survey 2025 సర్వేను ప్రారంభించింది.
ఈ సర్వే ను మొదటి విడతలో 10 జిల్లాలలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరిని సర్వే చేయుటకు సర్వేయర్లుగా నియమిస్తూ GSWS Employees Latest Verions App Version 6.0 P4 SURVEY ఆప్షన్ను ఇవ్వటం జరిగినది.
AP P4 Survey 2025 Last Date ఈ సర్వే ఫిబ్రవరి 20, 2025న ప్రారంభమై మార్చి 2, 2025న మొదటి విడతల ముగిస్తుంది. సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్లలో ఉన్న అన్ని
కుటుంబాలకు ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుంది.
ప్రజలు కూడా ఈ ఒక్క సర్వేలో భాగమై మీయొక్క ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై అడిగే ప్రశ్నలపై సరైన సమాధానాలు ఇచ్చి ఆంధ్ర విజన్ 2047 లో భాగం అవ్వండి .
AP P4 Survey 1st Phase Districts
1. అనంతపురం
2. అన్నమయ్య
3. చిత్తూరు
4. కర్నూలు
5. నంద్యాల
6. ప్రకాశం
7. నెల్లూరు
8. సత్యసాయి
9. తిరుపతి
10. వైఎస్ఆర్ కడప